గచ్చిబౌలిలో టిప్పర్ బీభత్సం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ క్రైం చీఫ్:

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విప్రో కూడలి వద్ద ఓ టిప్పర్‌ లారీ బీభత్సం సృష్టించింది. సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న 4 కార్లు, 2 బైక్‌లపైకి దూసుకెళ్లింది. రెడ్ సిగ్నల్ ఉన్నా.. ఆగకుండా ముందుకు దూసుకొచ్చిన టిప్పర్ లారీ వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురకి తీవ్ర గాయాలు కాగా.. ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతుడు స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్‌గా గుర్తించారు. ప్రమాదం ధాటికి కార్లు, బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బ్రేకులు ఫెయిల్ కావటంతోనే ఈ ప్రమాదం జరిగనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని.. ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.