తన గురించి వస్తున్న వార్తలను ఖండించిన యాంకర్ సుమ కనకాల

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: స్టార్ యాంకర్ సుమ కనకాల ఇక యాంకరింగ్ చేయడం మానేస్తున్నారని.. ఆమె కొన్నాళ్ల పాటు విరామం తీసుకోబోతున్నారని నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి కారణం ఒక ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో. డిసెంబర్ 31న ఈటీవీలో ప్రసారం కానున్న ‘వేర్ ఈజ్ ది పార్టీ’ ఈవెంట్‌కు సంబంధించిన రెండో ప్రోమో నిన్న విడుదలైంది. ఈ ఈవెంట్‌కు సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ప్రోమో చివరిలో సుమ మాట్లాడుతూ.. తాను కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకుంటున్నానని కంటతడి పెట్టారు. దీంతో ఆమె యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.సుమ యాంకరింగ్ మానేస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో ఆమె స్నేహితులు, సన్నిహితులు ఫోన్లు చేయడం మొదలుపెట్టారట. దీంతో సుమ రంగంలోకి దిగారు. మీడియాలో వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఒక వీడియో మెసేజ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.‘‘రీసెంట్‌గా ఒక న్యూ ఇయర్ ఈవెంట్ చేశాం. దాని ప్రోమో కూడా రిలీజ్ చేశాం. ఆ ప్రోమో కొంచెం హల్‌చల్ చేస్తోంది. ఆ ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. అయితే, మొత్తం ఈవెంట్ అంతా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. కంగారు పడకండి.. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు. సో.. నేను ఒక్కటే చెప్పాలనుకున్నది ఏంటంటే.. నేను టీవీ కోసమే పుట్టాను, నేను ఎంటర్‌టైన్మెంట్ కోసమే పుట్టాను, నేను ఎటూ వెళ్లట్లేదు. కాబట్టి, మీరు హాయిగా ఉండండి.. హ్యాపీగా ఉండండి.. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని సుమ వీడియో మెసేజ్‌లో వెల్లడించారు.నేను ఎక్కడికీ వెళ్లడం లేదు.. కంగారు పడకండి: యాంకర్ సుమమొత్తం మీద నిన్నటి నుంచీ వైరల్ అవుతోన్న ఒక న్యూస్‌కి ఈ వీడియో మెసేజ్‌తో ఫుల్ స్టాప్ పెట్టేశారు సుమ. ప్రస్తుతం సుమ ఈటీవీలో ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో పాటు పండగలకు, ప్రత్యేక సందర్భాల్లో ఈటీవీలో వచ్చే షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే, సినిమా ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో అస్సలు తీరిక లేకుండా గడుపుతున్నారు సుమ. మరి ఇంత బిజీ యాంకర్ గ్యాప్ తీసుకోవడం కుదురుతుందా. కాబట్టి, సుమ అభిమానులు కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు.

Leave A Reply

Your email address will not be published.