రెండో రోజు రైతుబంధు రూ.1218.38 కోట్లు

- 15.96 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రెండో రోజు రైతుబంధు రూ.1218.38 కోట్లు 15.96 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 24 లక్షల 36 వేల 775.07 ఎకరాలకు గాను రూ.1218 కోట్ల 38 లక్షల 75,934 వ్యవసాయ వృద్ది కొరకే రైతుబంధు పథకం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, సాగునీరు, మిషన్ కాకతీయ, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల పథకాలతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, విత్తనాల కోసం లైన్లలో నిలబడి, ఎరువుల కోసం లాఠీదెబ్బలు తిన్న గత పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు లేదన్నారు. ప్రభుత్వ చర్యల మూలంగా ఎనిమిదేళ్లలో తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో, పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది, తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశమంతా అమలు జరగాలని భారత రైతాంగం డిమాండ్ చేస్తున్నదన్నారు. దేశంలో కేసీఆర్ గురించి, తెలంగాణ పథకాల గురించి మాట్లాడుకోవడం మొదలయిందని, కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అన్నారు. అబ్ కి బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయి, అందుకే తెలంగాణ అభివృద్దికి అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారని సింగిరెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.