30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను అధికారులు రద్దు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం.. ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక, ధర్మదర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలను కూడా క్యాన్సల్‌ చేస్తున్నామని వెల్లడించారు. నిత్యకైంకర్యాలను ఆంతరంగికంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు యాదాద్రీశ్వరుడిని నలుగురు రాష్ట్రపతులు మాత్రమే దర్శించుకోవడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.