వరకట్నం కోసం తనను హింసిస్తున్నారు
- తనకు ప్రాణహాని ఉందని రాష్ట్రపతికి ప్రజ్ఞారెడ్డి విజ్ఞప్తి - ప్రజ్ఞారెడ్డి లేఖపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ప్రజ్ఞారెడ్డి లేఖపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డిపై వేధింపుల వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రైవేట్ సెక్రటరీకి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. తనను వేధిస్తున్నారంటూ పుల్లారెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. వరకట్నం కోసం తనను హింసిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రజ్ఞారెడ్డి పేర్కొన్నారు. తన లేఖపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.