తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వికలాంగుల దినోస్సత్సవం,దివ్యకళా ఫౌండేషన్, డాన్స్ అకాడమి ప్రథమ వార్శికోత్సవం పురస్కరించుకొని మల్కాజ్గిరి లో వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ ఎంజే సిస్టర్స్ ను ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా ఆక్టివిస్ట్ ఎంజే సిస్టర్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మాహియా రాజ్ మాట్లాడుతూ నేడు దివ్యకళా ఫౌండేషన్ ప్రథమ వార్శికోత్సవం సందర్బంగా వికలాంగుల దినోస్సత్సవం జరుపడం అభినందనీయమన్నారు.నేడు ప్రపంచం లో అనేక మంది అనేక విదాలై అంగ వైకల్యం తో బాదపడుతున్నారని ఐనప్పటికీ వారు మేము వికలంగులం కాదు సకలాంగులం అని నిరూపించుకోవడం అభినందనీయమన్నారు. వికలాంగులను ఆదరించవలసిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.ఇలాంటి వారిని దివ్యకళా ఫౌండేషన్ గుర్తించి సన్మానించడం అభినందనీయమన్నారు.ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ ఎంజే సిస్టర్స్ జ్యోతి, డాన్ మాహియా రాజ్, వాణి రెడ్డి లను ఘంగ సత్కరించారు.ఈ కార్యక్రమం లో సంస్థ ఫౌండర్ చర్మెన్ గడ్డం సంతోష్ సునీతా తదితరులు పాల్గొన్నారు.