దేశంలో 243 కరోనా కొత్త కేసులు నమోదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో గత 24 గంటల్లో 243 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు 2,13,080 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 243 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 4,46,78,158కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,699కి చేరింది.ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.09 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.