సిసి కెమెరాలపై వ్యాపారస్తులకు అవగాహన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: నసురుల్లాబాద్ మండలంలోని వ్యాపారస్తులకు నసురుల్లాబాద్ ఎస్సై రంజిత్ రెడ్డి అవగాహన కల్పించారు. మండకేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన దోపిడీ దొంగతనాలు, అనుమానస్పద సంఘటనలు జరిగినప్పుడు నేరస్తులను పట్టుకునేందుకు సిసి కెమెరాలు ఎంతగానో  ఉపయోగాపడతాయన్నారు. సీసీ కెమెరా లు ఏర్పాటు , సైబర్నూ క్రైమ్త తదితర అంశాలపై ఎస్సై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.