నసురుల్లాబాద్ లో టిఆర్ఎస్ నాయకుల సంబరాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/నసురుల్లాబాద్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటించిన సందర్భంగా, కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెర్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు సీట్లు పంచుకొని, టపాసులు పేల్చి ఘనంగా టిఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు, తెరాస మండల అధ్యక్షులు పెర్క శ్రీనివాస్ మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో చేస్తున్న అనేక సంక్షేమాలతో అభివృద్ధి పథకాలతో ముందుకు వెళుతున్న సందర్భంగా దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర వైపు చూస్తున్నారని దేశాన్ని ముందుకు నడిపించేందుకు మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, జాతీయ పార్టీగా ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు. గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండావార్ బాలకృష్ణ, జిల్లా కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ మజీద్, తెరాస పార్టీ సెక్రటరీ యెడ మోహన్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు వంగ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ వనం వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, యువజన విభాగం అధ్యక్షులు బొడిగె భాను ప్రకాష్ గౌడ్, చుంచు సాయిలు, మైశగౌడ్, నవషాదుల్లా, నర్సింలు గౌడ్, చిన్న రెడ్డి, అల్లం రవికుమార్, కాజా, మంగళి సాయిలు, మండల కేంద్రంతో పాటు వేద గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అనుబంధ సంస్థ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.