లక్కీ డ్రా విజేత లకు బహుమతులు అందచేసిన రూరల్ సిఐ మురళి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: మండల కేంద్రం బీర్కూర్లోని లక్ష్మి నరసింహ ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంక్ )లో పెట్రోల్ పోసుకున్న వాహనదారులకు లక్కీ డ్రా కూపన్లు అందచేయడం జరిగిందని యజమాని మియ్యపురం శశికాంత్ తెలిపారు. సోమవారం రోజు రూరల్ సిఐ మురళి సమక్షంలో తీసిన డ్రా లో గెలుపొందిన వాహనదారులకు బహుమతులను రూరల్ సిఐ మురళి అందచేశారు. ఫిల్లింగ్ స్టేషన్ కు వచ్చిన వాహనదారులకు, రైతులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అవారి ప్రవీణ్ కుమార్, పృథ్వీ గౌడ్, అశోక్, చంద్రకాంత్, వాహనదారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.