బ్యానర్లు చించి వేసిన వారిపై కఠిన చర్యలు తెసుకోవాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అంబర్పేట్ డివిజన్ ప్రేమ్ నగర్ లో హోటల్ గ్రీన్లాండ్ వద్ద గత 13 సంవత్సరాల నుంచి పండుగలకు శుభదినాలకు జాతీయ పండుగలకు పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ విద్యార్థి విభాగం నాయకులు రాజశేఖర్ గంగాపుత్ర ఆధ్వర్యంలో బ్యానర్ ను పెడతాం.కానీ ఈ సంవత్సరము మొన్న 31st నాడు నైట్ నా యొక్క బ్యానర్ను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేయడం జరిగింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాలని, ఇకముందు ఇలాంటి చర్యలు ఎవరు చేసినా వారికి చట్టపరమైన శిక్షలు విధించాలని అంబర్పేట్ ఎస్సై మధు గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి విభాగం నాయకుడు వెంకట్ గౌడ్, వీరేశం, సాయి పాల్గొన్నారు.