హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హష్ ఆయిల్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది. సంక్రాంతి పండుగ టార్గెట్గా ఈ ముఠా హాష్ ఆయిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రవీణ్ కుమార్ అనే సప్లైర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మోహన్ యాదవ్, కల్యాణ్, సురేష్ ముగ్గురు డ్రగ్స్ కంజూమర్స్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 బాటిల్స్ హాష్ ఆయిల్, నాలువందల లీటర్ల పెట్రోల్ ఈథర్ను స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలియం ఈథర్, గంజాయితో ఈ ముఠా హాష్ ఆయిల్ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 15 మంద్రి డ్రగ్స్ పెడ్లర్లతో ప్రవీణ్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.