గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల ఛైర్మన్ లతో సమావేశం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ : గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల ఛైర్మన్ లతో ఏఐసీసీ పరిశీలకులు గిరీష్ చోడొంకర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిలు గురువారం 11 గంటలకు సమావేశమయ్యారు. జనవరి 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో హాత్ సే హాత్ జోడో ఏఐసీసీ పరిశీలకులు గిరీష్ చోడొంకర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్ అనుబంధ సంఘాల ఛైర్మన్ లు పాల్గొన్నారు.