అభివృద్ధి ముసుగులో రైతుల భూములను గుంజుకుంటోన్న ప్రభుత్వం
- బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం అకారణంగా రైతుల భూములను గుంజుకుంటోందని ఎమ్మెల్యే ఈటల తెలిపారు. మార్కెట్ ధరలో 10 శాతం ధర కూడా రైతులకు ఇవ్వడం లేదని విమర్శించారు. దున్నుకునే భూములు లాక్కుంటే రైతులు ఎక్కడికి పోవాలి? అని, ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈటల ప్రశ్నించారు. ప్రభుత్వం, కలెక్టర్ వెంటనే స్పందించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.