ముఖ్యమైన రంగంగా ప్రభుత్వం ఫుడ్ ప్రొసెసింగ్ రంగం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుగారి విజన్ మేరకు ప్రభుత్వం సాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగం పై ప్రత్యేక శ్రద్ద వహించడంలో తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారం గా ప్రసిద్దికెక్కి ధాన్యం ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించి వ్యవసాయ తెలంగాణ గా అవతరించింది . వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ, లైవ్ స్టాక్ లలో ఉత్పత్తి పెరగడంతో ప్రభుత్వం ఫుడ్ ప్రొసెసింగ్ రంగాన్ని ముఖ్యమైన రంగంగా గుర్తించింది. ప్రభుత్వం ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించడంతో దేశీయ , అంతర్జాతీయ పెట్టుబడులు పెరిగాయి . స్థానికంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పించడం, వాటిని ఆన్ డిమాండ్ గా అమ్ముకోవడం, మిగిలిన పంటను ఆహార కేంద్రాల్లో ప్రాసెసింగ్ చేస్తారు. దీంతో మహిళాసంఘాలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం, రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీలేని ఆహార ఉత్పత్తులను అందించడం, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏర్పడింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డేటా ప్రకారం రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థిర మూలధనం రూ. 4436 కోట్లు. 2021 నాటికి ఇది 53% పెరిగి రూ.6812 కోట్లకు చేరుకున్నది. 2022-23లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ( ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్) కు అదనంగా 2022-23 లో ఫుడ్ ప్రొసెసింగ్ జోన్లలో మరో 2396 కోట్ల పెట్టుబడుల ప్రక్రియ పురోగతిలో ఉంది. రూ. 2500 కోట్లకు పైగా పెట్టుబడులతో పలు మెగా ప్రాజెక్టులు అండర్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. దీనితో ఈ రంగంలో స్థిర మూలధనం రూ. 10 వేల కోట్లను దాటే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థిర మూలధనం రెట్టింపుకు చేరుకున్నాయి. TS I PASS డాటా ప్రకారం ఫుడ్ ప్రొసెసింగ్ సెక్టార్ లో 2017 నుండి 2021 వరకు 2140 యూనిట్ల ద్వారా 2376 కోట్ల పెట్టుబడి పెట్టడం వలన 29841 మందికి ఉద్యోగాలు లభించాయి. ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్ , డైరీ యూనిట్స్ , స్పైస్ ప్రాసెసింగ్ యూనిట్లలో పెట్టుబడులు చేశారు.యువతకు ఉపాది అవకాశాలు కల్పించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను జోడించి రైతులను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా 2021 లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటును ప్రారంభించడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7150 ఎకరాలలో 21 స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసింది.నవంబర్ 2022 నాటికి రూ.2396 కోట్ల పెట్టుబడికి సంబంధించి 1496 దరఖాస్తులు రాగా 3038 ఎకరాలకు సంబంధించి 1031 ఆలాట్మెంట్ ఆర్డర్ లను జారీ చేయడమైనది. రైస్ మిల్స్, ఎథనాల్ అథారిటీ పరిశ్రమలు, డైరీ , ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ లలో ఎక్కువగా పెట్టుబడులు నమోదయ్యాయి. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంట్రప్రేన్యూర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకంగా రూ. 10 లక్షల వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రభుత్వం తోడ్పాటునిస్తున్నది. నవంబర్ 2022 నాటికి 834 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, కోలాటెరల్ ఫ్రీ లోన్ , క్యాపిటల్ గ్రాంట్ మంజూరయ్యాయి. ఈ యూనిట్లు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. వీటితో పాటు మరో 3132 దరఖాస్తుల అనుమతుల మంజూరు ప్రాసెస్ లో ఉన్నాయి.