ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో త్వరలో మరో కొత్త ప్రాంతీయ పార్టీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో సంక్రాంతి తర్వాత మరో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీ తెలంగాణ సీఎంలు పాలనను గాలికొదిలేశారని విమర్శలు గుప్పించారు. విభజన సమస్యలపై కేంద్ర మీటింగ్కు.. ఏపీ వాళ్ళు హాజరైతే, తెలంగాణ వాళ్ళు వెళ్లట్లేదని.. తెలంగాణ వాళ్ళు వెళ్తే, ఏపీ వాళ్ళు వెళ్లట్లేదని మండిపడ్డారు. అవగాహనలో భాగంగానే కృష్ణా, గోదావరి మేనేజ్మెంట్ మీటింగ్లకు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరుకావటం లేదని ఆరోపించారు. నీటి పంపకాల విషయంలో ఇద్దరు సీఎంలు పట్టనట్లుగా వ్యహరిస్తున్నారన్నారు. ఇద్దరు సీఎంల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే కమ్యునిస్టులు బీజేపీని తిడుతున్నారని తెలిపారు. ఠాగూర్ వెళ్లినా… ఠాక్రే వచ్చినా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది అంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.