ఆత్మహత్యకు పాల్పడ్డ నీటిపారుదల శాఖా డిఈఈ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకట రమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో వెంకటరమణా రావు మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం నవీపేట్ మండలం పోతంగల్లో అదృశ్యమైనట్టు కుటుంబసభ్యులు నవీపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, నిజామాబాద్ నగరంలోని మారుతీనగర్లో నివాసం ఉంటూ ఆర్మూర్లో పనిచేస్తున్న వెంకటరమణా రావు కొన్నాళ్లుగా సెలవులో ఉన్నట్టు తెలిసింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. గురువారం ఇంటి నుంచి బైక్పై వెళ్లిన అతను గోదావరి వద్ద బైక్ను వదిలివేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టం కొరకు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.