పార్టీ ఫిరాయింపులతో కేసీఆర్ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారు

- టిపిసిసి రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మొయినాబాద్ లో ఆయన మాట్లాడారు. అందుకె 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. అయినా కేసీఆర్ ఆలోచనలో మార్పు రాలేదన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించారు. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారు అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిరాయింపులకు ప్రోత్సహించారు. పిరాయింపు ఎమ్మెల్యేలపై వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో పిర్యాదు చేసింది. ఫిర్యాదులపై స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం వద్దకు చేరాయి. రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ కేసును కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన 12 మందిపై కూడా విచారణ చేయాలి. పోలీస్ స్టేషన్ కు వస్తే ఉన్నతాధికారులు లేకపోవడం దురదృష్టకరం. 455 ఎఫ్.ఐ. ఆర్. తో పాటు మేం ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించి విచారణ చేపట్టాలి. కేసీఆర్ ఫిరాయింపు రాజకీయానికి సమాధి కట్టాలి. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను ఛేదించాలి. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. పోలీస్ స్టేషన్ లొనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా వివరాలతో పిర్యాదు చేస్తామన్నారు. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. అవసరమైన ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ పోరాటం చేయడానికీ వెనకాడబోమని స్పష్టం చేసారు.

Leave A Reply

Your email address will not be published.