తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. పరిశ్రమకు చెందిన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగి అంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. మృతుల్లో ఇద్దరిని ఏపీ శ్రీకాకుళం వాసి లోకేశ్వర్రావు (38), బెంగాల్ వాసి పరితోష్ మెహత (40), బిహార్ వాసి రంజిత్కుమార్ (27)గా గుర్తించారు. లోకేశ్శ్వర్రావు అసిస్టెంట్గా పని చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.