తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఒక వేళ భారాసను వీడాల్సి వస్తే దిల్లీలోనో, అమెరికాలోనో దొంగచాటుగా కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకొంటానని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు తాను భారాసను వీడుతున్నానని మీడియానే ప్రచారం చేస్తోందని అన్నారు. అంతకుముందు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరరావు ఇంటి వద్ద కార్యకర్తలతో ఆయన కాసేపు ముచ్చటించారు. అందరికీ అండగా ఉంటానని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.