రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/రైలు ఢీకొనడంతో 150 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల సమీ పంలోని రాజోలి అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం జరిగింది. గొర్రెల కాపరి జీవాలను మేపుతుండగా వాటిని కుక్కలు తరిమాయి. దీంతో గొర్రెలు భయంతో రైల్వేట్రాక్ పైకి పరిగెత్తగా ట్రైన్ ఢీకొని 150 చనిపోయాయి. మరో 50 గోర్లు గాయాలపాలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.