మునిగడపలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం మునిగడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్ట్‌ను ఢీకొని కారు కాలువలో పడ్డ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు సమ్మయ్య, స్రవంతి, లోకేష్, రాజమణి, భవ్యశ్రీ గుర్తించారు. మృతులు యాదాద్రి జిల్లా బీబీనగర్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. వేములవాడ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.