టీఆర్ఎస్ ఎంపీలకు షాక్
పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్కు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ ఎంపీలు. కేశవరావు, నామా నాగేశ్వరావుల చైర్మెన్ పదవులను కేంద్రం తొలగించింది. టీఆర్ఎస్కు 16 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా కనీసం ఒక్క పార్లమెంటరీ కమిటీకి కూడా చైర్మన్ను నియమించలేదు.
ఇప్పటివరకు పరిశ్రమలశాఖ కమిటీ చైర్మెన్గా ఉన్న కేశవరావు.. ఇక ఆ కమిటీలో సభ్యునిగా మాత్రమే కొనసాగనున్నారు. అలాగూ లైబ్రరీ కమిటీ చైర్మెన్గా ఉన్న నామా కూడా ఆ కమిటీలో సభ్యునిగా ఉండనున్నారు. పార్లమెంటరీ కమిటీలను నియమిస్తూ ఇటీవలె పార్లమెంట్ బులెటిన్ విడుదల చేసింది.