సీఎం కేసీఆర్ పర్యటనకు నిరసన సెగ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్ పర్యటనకు నిరసన సెగ తగిలింది. సీఎం కాన్వాయ్ ముందుకు నిరసనకారులు దూసుకొచ్చారు. కేసీఆర్ కాన్వాయ్కు బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు చల్లా గోవర్ధన్ అడ్డుపడ్డారు. దీంతో గోవర్ధన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఏజెన్సీలో సాగుచేస్తున్న గిరిజనేతరుల భూములకు.. హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పలుచోట్ల సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిరసనలు చేపట్టింది. మహబూబాబాద్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాలను కేసీఆర్‌ ప్రారంభించారు. ఉదయం మహబూబాబాద్‌, మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లను ప్రారంభించారు. ఈ రెండు చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలనూ కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ రెండు కలెక్టరేట్ల ప్రారంభంతో ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కొత్త కలెక్టరేట్‌ భవనాల సంఖ్య 16కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.