కేటీఆర్‌లా తండ్రిని అడ్డుపెట్టుకుని తాను మంత్రిని కాలేదు

-   దిగజారి మాట్లాడుతున్నా కేటీఆర్‌ :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్‌లా తండ్రిని అడ్డుపెట్టుకుని తాను మంత్రిని కాలేదన్నారు. కేటీఆర్.. కేసీఆర్‌ కంటే దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కిందిస్థాయి నుంచి కష్టపడి ఎదిగానని చెప్పారు. కేటీఆర్ కాదు.. రాజీనమా లేఖతో కేసీఆర్ సిద్ధంగా ఉంటే.. కేంద్ర నిధులపై చర్చకు రెడీ అన్నారు. మంత్రి కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని విమర్శించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. వందే భారత్ రైలు తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకని కిషన్‌రెడ్డి అన్నారు. రేపు ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం పంపిందని, కార్యక్రమానికి హాజరవడం కేసీఆర్ విజ్ఞత అన్నారు.

Leave A Reply

Your email address will not be published.