తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందాం. అందుకనే ఇక మా కుటుంబంలో నేను, మా కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన శనివారం ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘‘మా ఇంకొల్లు వచ్చాను… మా ప్రజలకు నా మనసులో మాట చెప్పాలి. కొన్ని రాజకీయ విషయాలు మాట్లాడతాను. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మేం ఇమడలేమని నిర్ణయించుకున్నాం. లేచిన దగ్గర నుంచి నిత్యం డబ్బుతో నడిచే రాజకీయాలు నేను మనసు చంపుకొని చేయలేను. అవసరమైతే, ప్రజాసేవ చేయాలనుకుంటే ఎటువంటి పదవులు లేకపోయినా నాకు అవకాశం ఉన్న మేరకు సొంతంగా చేస్తా. గతానికి, ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు పోలికలేదు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవు’’ అని దగ్గుపాటి అన్నారు. ఆయన సంక్షిప్త ప్రసంగం విన్న మండల స్థాయి నాయకులు, దగ్గుబాటి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.