బాలకృష్ణ టాక్ షోకు వెళ్ళను .. తేల్చి చెప్పిన రోజా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆహాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న టాక్ షో అన్ స్టాపబుల్. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిచింది. ఇప్పటికే ఎంతో మంది సినిమా తారలు ఈ షోకు గెస్ట్స్ గా వచ్చారు. సినిమా సెలబ్రెటీలతో పాటు సీజన్ 2లో పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ షో కు హాజరయ్యారు. సరదా సంభాషణలతో పాటు రాజకీయ పరమైన ప్రశ్నలు కూడా అడిగి సమాదానాలు రాబట్టారు బాలయ్య. ముఖ్యంగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ సీజన్ 2కు మొదటి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అలనాటి నటి, ఏపీ మంత్రి రోజా కూడా ఈ షోకు హాజరవుతారంటూ పుకార్లు షికారు చేసాయి.

తాజాగా రోజా టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించారు రోజా. ఆమె మాట్లాడుతూ.. గతంలోనే అన్ స్టాపబుల్ కు రావాలని ఆహ్వానం అందిందని.. కానీ ఆసమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఆ షోకి హాజరవ్వడం కుదరలేదని తెలిపారు. ఇక ఇప్పుడు ఆహ్వానించినా అస్సలు వెళ్ళాను అంటూ తెగేసి చెప్పారు. ఎప్పుడైతే బాలకృష్ణ షోకు చంద్రబాబు హాజరయ్యారో అప్పడే ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా అని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించే విధంగా చంద్రబాబు, బాలకృష్ణ మాట్లాడటంతో తనకు ఈ కార్యక్రమానికి వెళ్లాలన్న ఆసక్తి కూడా లేకుండా పోయిందని తెలిపారు. బాలకృష్ణ, చంద్రబాబు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడవడం కరెక్టే అనేలా మాట్లాడారని.. ఎన్టీఆర్ గారిని బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తమ రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బాలకృష్ణ షో కు తాను వెళ్ళాను అని అన్నారు రోజా.

Leave A Reply

Your email address will not be published.