ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో విచక్షణ కోల్పొయిండు.
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో విచక్షణ కోల్పొయిండు, మతి స్థిమితం కోల్పొయినట్లున్నరని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. చివరకు చదువుకునే పిల్లలను రాజకీయాల్లోకి లాగుతున్నరు. బండి సంజయ్ కొడుకు విషయంలో రెండు నెలల క్రితం జరిగిన ఘటనను ఇప్పుడు తెరపైకి తెచ్చి కాలేజీపై ఒత్తిడి తెచ్చి సస్పెండ్ చేయించారు, కేసు పెట్టించారు బండి సంజయ్ ఎదుగులను చరూసి ఓర్వలేక ఇదంతా చేస్తున్నడని ఆరోపించారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, అంతకుముందు పరేడ్ మైదానంలో ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని వెలికితీస్తూ చేస్తున్న పోరాటంపై బండి సంజయ్ ను అభినందించడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నడు. అంతకుముందు తుక్కుగూడ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వరంగల్, కరీంనగర్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు సహా జాతీయ నాయకత్వం కేసీఆర్ అవినీతి, అక్రమాలు, నియంత పాలనను ఎండగడుతూ బండి సంజయ్ పాదయాత్ర ద్వారా చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తుంటే తట్టుకోలేక పోతున్నడన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కేసీఆర్ ప్రభుత్వ సంగతి ఏందో తేలుస్తాం. ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు అని ఆయన హెచ్చరించారు.