గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు?
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: బీజేపీ ని ఓడించాలనే ఆలోచన కేసీఆర్ కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ నేతలు భాగస్వాములని ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నానన్న కేసీఆర్.. కాంగ్రెస్పై విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినవేనన్నారు.