జిమ్ లో వ్యాయామం చేస్తూ వృద్ధుడు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయ్ నగరంలోనున్న ఓ జిమ్‌లో రోజూ మాదిరిగానే ప్రహ్లాద్ నికం (67) అనే వృద్ధుడు బుధవారం వ్యాయామం చేయడానికి వెళ్లాడు. ఐతే జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో ఉదయం 7 గంటల 30 నిముషాలకు ప్రహ్లాద్ నికం ఒక్కసారిగా కుప్పకూలాడు. జిమ్‌ సిబ్బంది హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు వృద్ధుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రహ్లాద్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.