బీఆర్ఎస్ సభలో జై తెలంగాణ అనడానికి సిగ్గుపడ్డ సీఎం కేసీఆర్

- టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గురువారం ఛలో ఢిల్లీ గోడ పత్రికలుకరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉన్నాయనికాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు పూర్తి కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని చెప్పడం అబద్దమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారన్నారు.ప్రైవేటుకు వ్యతిరేకమని చెబుతున్న కేసీఅర్ సింగరేణిలో సగం ప్రైవేటుపరం చేసింది నిజం కాదాఅని కోదండరాం ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదనివిద్యావైద్యంసింగరేణి ప్రైవేటు అయ్యిందని.. ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై డిల్లీలో పోరాడుతామని, 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.