9 న తెలంగాణా మేరు సంఘం దసరా ఆత్మీయ సమ్మేలనం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణా మేరు సంఘం దసరా ఆత్మీయ సమ్మేలనం ఈ నెల 9 న హైదరాబాద్ లోని దారుల్ షిఫా లో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అద్యక్షులు కొవ్వూరు బాస్కర్ రావు మేరు తెలిపారు.శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి దీకొండ నర్సింగ్ రావు,సభా కమిటి కన్వినర్ అడపా వెంకటేశ్వర్ రావు లతో కలిసి మాట్లాడారు.ఈ కర్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్,బిసి కమిషన్ చర్మెన్ వకులాబరణం క్రిష్ణమోహన్ రావు,ఉప్పల్ ఎంఎల్ఏ భీతి శుబాస్ రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు.ఉప్పల్ బాగాయత్ లో మేరు ఆత్మా గౌరవ భావన నిర్మాణం కోసం ముఖ్య మంత్రి కేసిఆర్ ఎకరం స్థలం, కోటి రుపాయలు కెటాఇన్చినన్దులకు క్రుతజ్ఞాతలు తెలిపారు.పద్మశాలిలకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిన మాదిరిగా మేరు లకు కుడా పోలీస్, హాస్పిటల్స్,హోం గార్డ్స్ లకు యునిఫామ్స్ తయారి లు మేరు సంఘానికే కేటాయించాలని కోరారు.ఈ సమావేశం లోఎస్బి సంగేవార్ మేరు,తాళ్ళ వెంకటేశ్వర్ రావు మేరు,కీర్తి శేకర్ మేరు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.