అగ్నిప్రమాదాలకు కారణం అక్రమ నిర్మాణాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్‌తో కేంద్రమంత్రి ఫోన్‌లో సంభాషించారు. దట్టంగా అలుముకున్న పొగతో స్థానిక ప్రజల ఇబ్బందులు పడ్డారని… వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్తీవాసుల యోగక్షేమాలను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా అక్రమనిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడం సరైనది కాదన్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అగ్నిప్రమాదాలకు కారణం అక్రమ నిర్మాణాలని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రమాదాలు అక్రమ నిర్మాణాల్లోనే జరిగాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.