బేగం బజార్ ఫిష్ మార్కెట్ విషయంలో టీఆరెస్ నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు

- మెట్టు సాయి కుమార్ , ఫిషర్ మెన్ కాంగ్రెస్ చైర్మన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బేగం బజార్ అభివృద్ధి ముఖేష్ గౌడ్ మంత్రి గా ఉన్నప్పుడు ఆయన చొరవ తోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది టీఆరెస్ నాయకులు మాటల తో మూటలు గట్టి ఆ పెరును తమ నాయకులకు వచ్చే విధంగా నిత్యం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫిషర్ మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. బేగం బజార్ ఫిష్ మార్కెట్ లో ఉన్న వ్యాపారులను అధికార పార్టీకి సంబంధించిన నేతలు మోసం చేయాలని చూస్తున్నారు. ఇది ఓట్ల కోసమే టీఆరెస్ రాజకీయం చేస్తుంది. ముఖేష్ గౌడ్ శ్రమతోనే ఇప్పుడు ఆధునికరించిన ఫిష్ మార్కెట్..టీఆరెస్ నాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ముమ్మాటికీ 100 శాతం బేగంబజార్ అభివృద్ధి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖేష్ గౌడ్ చొరవ తో జరిగింది. అధికార పార్టీ బిఅరెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని అబద్ధాలు మానుకోవాలి. ముఖేష్ గౌడ్ చొరవ తోనే వందలమంది మత్సకారుల జీవితాలు బాగుపడ్డాయి. బేగం బజార్ ఫిషర్ మార్కెట్ కమిటీ కుటుంబాలు ముఖేష్ గౌడ్ గారిని మరిచిపోలేరు. అధికార పార్టీ నేతలు సమస్యలు పరిష్కరించకపోగా..కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు. కావాలని ఇక్కడి వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.