ఆర్ అండ్ బి శాఖపై సీఎం జగన్రెడ్డి సమీక్ష
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: R&B శాఖపై సీఎం జగన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలని సీఎం ఆదేశించారు. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని ఆయన సూచించారు. ఏడేళ్ల పాటు రోడ్లు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలన్నారు. అభివృద్ధి పనులు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని జగన్ సూచించారు.