భూమిపూజ ఏర్పాట్ల పరిశీలన
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 28.జనవరి 2023 శనివారం రోజు తాడ్కోల్ 2bhk కాలోని లో స్పీకర్ శ్రీ పొచారం శ్రీనివాస్ రెడ్డిచే కళ్యాణ మoడపం భూమి పూజ కార్యక్రమం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం స్థల పరిశీలన చేయడం జరిగింది. స్పీకర్ 2BHK కొత్త కాలనీలో మంజూరు చేయించిన 200 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ పనులు త్వరిత గతిన సకాలంలో పూర్తి చేసిన సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి,బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,బాన్సువాడ ప్యాక్స్ చైర్మన్ క్రిష్ణారెడ్డి,
బుడ్మీ ప్యాక్స్ చైర్మన్ పిట్ల శ్రీధర్,తెరాస సీనియర్ నాయకులు ఎజాజ్ గ స్పీకర్ వ్యక్తి గత సహాయకులు భగవాన్ రెడ్డి, నార్ల ఉదయ్ పాల్గొన్నారు.