సీఎం సహాయనిధి చెక్కు పంపిణి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ యం. నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ది దారులకు అందచేయడం జరిగింది. లబ్ధిదారులైన గాజుల మంజుల,మంత్రి కాశిరం వారు సీఎం కేసీఆర్ సార్ గారికి మరియు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు డి. నారాయణరెడ్డి గారు , పి.ఎ. సి. యస్ మాజీ వైస్ చైర్మన్ కె. రాజిరెడ్డి , కో- ఆప్షన్ సభ్యులు వస్సియోద్దీన్ , బండి పండరి , ఆత్మ కమిటీ డైరెక్టర్ ఈ. సాయిలు యాదవ్, టీ ఆర్ యస్ కార్యకర్త బి. సాయగౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.