దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈసారి ఈ వేడుకలు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ.. వీటిని నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం ప్రధాన కార్యక్రమానికి ముందు జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక్కడ దేశంలోని అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత, ప్రధాని మోడీ ఇక్కడ డిజిటల్ విజిటర్స్ బుక్‌లో తన మన్ కీ బాత్‌ను రికార్డ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.