కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య కుట్రలు చేస్తున్నాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మోదీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక..ప్రజలకే కాదు.. పసిపిల్లల ప్రాణాలకు కూడా రక్షణ లేదు. పిల్లలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తున్నా నిందితులను పట్టుకునేవారు లేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.  సీఎం పేషీలో ఉన్న ఐఏఎస్ అధికారికే రక్షణ లేని పరిస్థితి ఉందని ఒకప్పుడు సాయంత్రం 6 దాటితే తాగుబోతుల అడ్డాగా ఉండేది. ఇప్పుడు డబుల్ రోడ్లు, హైదరాబాద్ లా లైట్లు వెలుగుతున్నాయంటే కారణం నేను కాదా? కొడంగల్ లో జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజికి నిధులు తెచ్చింది నేను కాదా? ఇవాళ మిషన్ భగీరథ అంటున్నారు.. కానీ 2011లోనే కోయిల్ కొండ నుంచి 350 గ్రామాలకు ఇంటింటికి నల్లా నీళ్లు నేను తెప్పించిన అన్నారు. దత్తత తీసుకున్న డ్రామారావు ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు వేల కోట్ల అభివృద్ధి జరిగింది. మరి కొడంగల్ లో ఎందుకు అభివృద్ధి జరగడం లేదని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచి ఉంటే ఇవాళ కేసీఆర్ కాదు.. ఎవరు ఉన్నా అసెంబ్లీలో ప్రశ్నించి నిధులు తెచ్చేవాడిని. కానీ ఇవాళ అడిగేవాడు లేడు.. అడక్కునే వాడు లేడు. నేను మణులు, మాన్యాలు అడగడం లేదు…. మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. బంగారు తెలంగాణ అణా కేసీఆర్ ఇవాళ బొందలగడ్డగా మార్చారు. ఎక్కడ చూసినా చావులే కనిపిస్తున్నాయి. తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కలిగించే బాధ్యత కొడంగల్ ప్రజలపై ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..

Leave A Reply

Your email address will not be published.