రాజ్యాంగంలో నాలుగు వ్యవస్థలను ప్రశ్నించే తత్వంతో ముందుకు కొనసాగాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పునస్కరించుకొని సదాశివపేట పట్టణ ఆర్టీసీ కార్మికులు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వాతంత్ర సమరయోధుడు మునిపల్లి రామచందర్, స్వాతంత్ర సమరయోధుల వారసులను, మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారిని ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవ పండగ గా అది మన బ్రతుకులు మార్చే పండగ అని కొనియాడారు. ఈ గణతంత్ర దినోత్సవంను ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పరిపూర్ణంగా తెలుసుకొని రాజ్యాంగంలో కొనసాగుతున్నటువంటి నాలుగు వ్యవస్థలను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నించే తత్వంతో ముందుకు కొనసాగాలని పిలుపు నిచ్చారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నాలుగు వ్యవస్థలను కాపాడగలిగినప్పుడే రాష్ట్రాలు మరియు దేశం అభివృద్ధి పథంలో ముందుంటుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుల వారసులు జిల్లా అధ్యక్షులు మునిపల్లి రమేష్ గారు, ప్రధాన కార్యదర్శి కూచిని సతీష్, మరియు ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.