తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి విరుచుకుపడ్డారు. కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజుతో 25 ఏండ్లు అయింది. ప్రజా జీవితంలో ఉండడం సంతోశాన్ని ఇస్తుంది. కేసీఆర్కు మహిళలు అంటే చిన్న చూపు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. కేసీఆర్ నీ పని అయిపోయింది. రిటైర్మెంట్ తీసుకో…వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’’ అంటూ విజయశాంతి అన్నారు.