నటి జమున గారి మృతికి శాసన మండలి చైర్మన్ సంతాపం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీనియర్ నటి జమున గారి మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.తెలుగు, కన్నడ ,తమిళ,హిందీ,భాషల్లో 150 చిత్రాల్లో నటించిన జమున గారు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకున్నారని ఆయన తెలిపారు. 1980 లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికై, జమున ప్రజలకు ఎంతో సేవ చేసారని ఆయన తెలిపారు. జమున కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి తన సానుభూతిని వ్యక్తం చేశారు.