తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. బ్రాహ్మణులను, గోవులను కాపాడాలన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పున: స్థాపన జరగాలని రాజస్థాన్ జాలౌర్లో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు.యోగి తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారత్ను హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తారనే ప్రచారానికి యోగి తాజా వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయని ప్రతిపక్షనేతలంటున్నారు.రామ్చరిత్ మానస్ను నిషేధించాలంటూ సమాజ్వాదీ పార్టీ నేత మౌర్య డిమాండ్ చేయడం దుమారం రేపింది. దీనికి కౌంటర్గానే యోగి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.ఉత్తరప్రదేశ్లో యోగి రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశే కారణమైంది. అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుని బీజేపీ వరుసగా విజయకేతనాలు ఎగురవేయడానికి యూపీ కేంద్రంగా నిలిచింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.