లోకేష్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన నందమూరి తారకరత్న

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కుప్పం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. లోకేష్‌ పాదయాత్రలో నడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ సైతం ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా నారా లోకేష్‌తో పాటు పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పాదయాత్రలో పెద్ద మొత్తంలో జనం హాజరవడం.. కాస్త తోపులాట జరగడంతో తారకరత్న ఇబ్బందికి గురయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.

Leave A Reply

Your email address will not be published.