భారీ ఏర్పాట్ల మధ్య కొనసాగుతోన్న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం’ పాదయాత్ర భారీ ఏర్పాట్ల మధ్య కొనసాగుతోంది. లోకేశ్‌కు రక్షణగా 2 వందల మంది ప్రైవేటు బౌన్సర్లు 4వందల మంది వాలంటీర్లు వెంట ఉన్నారు. వారు కుప్పం నుంచి లోకేష్‌ను అనుసరిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర కోసం ప్రత్యేక కర్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతిపార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు.తొలిరోజు బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు పాల్గొననున్నారు. ముందుగానే కుప్పం చేరుకున్న పార్టీ నేతలు బహిరంగ సభ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై 300 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యక్తిగత పర్యవేక్షణలో సభా ఏర్పాట్లు జరిగాయి. వాలంటీర్లు పాదయాత్ర మొత్తం లోకేశ్‌తో పాటు కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు లోకేష్ లక్ష్మీపురం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు చేశారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కుప్పం బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి కూడా లోకేష్‌ నివాళులు అర్పించారు. యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కుప్పంకు వచ్చారు. దీంతో పసుపు జెండాలుటీడీపీ శ్రేణులతో సందడితో కుప్పం పసుపుమయంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.