మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన రెండు యుద్ధవిమానాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మధ్యప్రదేశ్లోని మొరెనా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు చేస్తున్న సమయంలో మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. యుద్ధ విమానాలు కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, ఇద్దరు పైలట్లు గాయపడ్డారని వెల్లడించారు. గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి విన్యాసాలు సాగుతుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు కూలిపోయాయని ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.కాగా, శనివారం ఉదయం 5.30 గంటలకు రెండు ఫైటర్ జెట్ విమానాలు కూలాయని మొరెనా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.