అదానీ కంపెనీ సంక్షోభానికి కారణాలపై, సెబీ విచారణ జరిపించాలి

- కాంగ్రెస్సీనియర్ నేత మల్లు రవి డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అదానీ కంపెనీ సంక్షోభానికి కారణాలపై, సెబీ విచారణ జరిపించాలని కాంగ్రెస్సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదానీ కంపెనీ షేర్స్ ఎందుకు కుప్పకూలాయి? అని ప్రశ్నించారు. అదానీకి పలు ప్రభుత్వ సంస్థలను కేంద్రం అప్పజెప్పిందన్నారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. LIC, SBIతో పాటు పలు సంస్థలు నష్టపోతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీప్రేక్షక పాత్ర మాని తక్షణ చర్యలు చేపట్టాలని మల్లు రవి డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.