పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఉషారాణి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు ఉషారాణి లొంగిపోయారు. ఆమెను మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దండ‌కార‌ణ్యం డివిజ‌న‌ల్ క‌మిటీ సెక్ర‌ట‌రీగా ఉషారాణి అలియాస్ పోచ‌క్క‌ ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపారు. ఉషారాణి అనారోగ్య కార‌ణాల‌తో లొంగిపోయిన‌ట్లు పేర్కొన్నారు. ఏపీకి చెందిన ఉష‌కు కొన్నేండ్ల పాటు దండ‌కార‌ణ్య ద‌ళంలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మావోయిస్టు ఉషారాణి స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తెనాలి. ఆమె మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీలో ఎంఏ చ‌దివారు. 1980లో మావోయిస్టు పార్టీలో చేరారు. దాదాపు 40 ఏండ్ల పాటు ఆమె వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీలో ప‌ని చేశారు.

Leave A Reply

Your email address will not be published.