గవర్నర్ ప్రసంగం పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు తరహాలో తెలంగాణ లో గవర్నర్ ప్రసంగం జరిగే అవకాశం లేదన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం సర్దుకుంటుందని ముందే చెప్పానని అన్నారు. తన కుమారుడి పోటీపై నిర్ణయం అధిష్టానం చూసుకుంటుందని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. కు జాతీయ స్థాయిలో ఆదరణ ఉంటుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత ఉందని, వామపక్షాల పొత్తు కలిసి వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలు లేవని ఆయన పేర్కొన్నారు. తనకు మంత్రి జగదీష్రెడ్డి తో ఎలాంటి విభేదాలు లేవని గుత్తా కొట్టిపారేశారు.