బాన్సువాడలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
- బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందగిరి రాజశేఖర్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేవైఎం ఇందూరు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు….నేడు చందూర్ మండల కేంద్రంలో జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చి రైతులను నమ్మించి ఓట్లు వేయించుకుని తీరా ఇప్పుడు ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు….నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి యువతను మోసం చేసారని, కేసీఆర్ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన దేశానిర్ధేశం చేశారు. …
ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్,కో కన్వీనర్ భూపాల్ రెడ్డి,జహీరాబాద్ పార్లమెంట్ సంఘటన కార్యదర్శి మహేష్ జీ,మండల అధ్యక్షులు నీలి హరీష్,ప్రధాన కార్యదర్శి వీరసారపు శ్రీనివాస్,శక్తి కేంద్ర ఇన్ ఛార్జ్ లు గణేష్ సింగ్,పాల్దె శ్రీనివాస్,బీజేవైఎం మండల అధ్యక్షులు దూస్ గాం సాహిత్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి యోగేశ్వర్ గౌడ్,ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు సర్దార్, సీనియర్ నాయకులు బొర్గం రాజు రెడ్డి, శివ కిరణ్,వడ్ల శంకర్,బాబు శేఖర్,అంజి,హరీష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు